మరోసారి జనంతో అహోబిళం

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి

 

 

మరోసారి అహోబిళం క్షేత్రం మారబోతున్నది.అహోబిళం క్షేత్రంలో ప్రతి యేడాది జరిగే బ్రహ్మోత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని నల్లమల గిరులను జనసంద్రంగా మారుస్తారు.అయితే ఈసారి జ్వాలాప్రయోగ సెంట్రల్ ట్రస్టు ఆద్వర్యంలో 130 వ మహాయగ్నంను శ్రీధర్ గురూజి ఆద్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ యగ్నం పిబ్రవరి 7వతేదీనుండి 17 వతేదీ వరకు జరుగుతుంది. పిబ్రవరి 10,12,17 వతేదీలలో పూర్ణాహుతి,జనార్ధన స్వామి అవతారోత్సవం వేడుకలను వైౌభవంగా నిర్వహిస్తారు.ఈమూడురోజులలో లక్షమందికి పైగా పాల్గొన వచ్చని అంచనా వేస్తున్నారు. దిగువ అహోబిళంలోొ జరిగే ఈ మహా యగ్నానికి భారీ ఎత్తున శ్రీదర్ గురూజి ఆద్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నారు..పదిరోజులపాటు జరిగే వేడుకలలో పాల్గొనే భక్తులకు ఉచితంగా భోజనము,అల్పాహారం ఏర్పాటుచేస్తున్నట్లునిర్వహకులు తెలిపారు..కార్యక్రమంలో విశేషాలను తెలుసుకోవడానికి 9444066669 ను సంప్రదించాలని నిర్వహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *