ఆరంభం అదుర్స్

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

అహోబిళ క్షేత్ర పారువేట ఉత్సవాల ముగింపు మరో 40 రోజుల సమయం ఉన్నప్పటికి ఆరంభమే అదుర్స్ గా ప్రజలు చర్చించుకుంటున్నారు..స్థానికి గ్రామీణ ప్రజలే కాకుండా తెలంగాణా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో భారీ భక్తులు  నరసింహస్వామికి ఉన్నారు. అహోబిళ క్షేత్రంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టినా భారీ ఎత్తున జనాలు దూరంతో,ధనంతో నిమిత్తం లేకుండా చేరుకుని, భక్తి భావాలను చాటుకుంటారు. రెండురోజుల క్రితం ఆరంభమైన పారువేటకు సాధారణ భక్తులతో పాటుగా విల్లంబులు ధరించిన మహిళలు తప్పెట వాయిద్య కారులు, నృత్యంచేసే మహిళలతో సందడి వాతావరణం నెలకొంది..గతంలో పారువేట ఉత్సవాలకు హాజరయ్యే జనంతో పోలిస్తే రెట్టింపు జనం హాజరు కావడంతో ఎగువ, దిగువ అహోబిళాలు జనంతో క్రిక్కిరిసి పోయాయి. స్వామి పల్లకి ఏ గ్రామం వెళితే ఆగ్రామంలో తండోపతండాలుగా మహిళలు ఎదురెక్కి స్వాగతం పలుకుతున్నారు. పారువేట వెంట ఆనందకరమైన దృశ్యాలు జనాస్త్రం వీక్షకులకు ప్రత్యేకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *