శభాష్ సుహాసిని రెడ్డి.. బైరెడ్డి, పట్ణం సురేంద్ర రెడ్డి ల ప్రశంశలు…

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

శభాష్ సుహాసిని రెడ్డి..
* బైరెడ్డి, పట్ణం సురేంద్ర రెడ్డి లు ప్రశంశలు…
* కుట్రలను పట్టించుకోవద్దు….
* వచ్చినవాల్లతోనే ముందుకు సాగుదాం…..


నంద్యాల పట్టణంలో జరిగిన అఖిల భారత రెడ్ల ఐక్యవేధిక సదస్సును విజయవంతం చేయడంలో కీలక భూమిక పోశించిన సానాల సుహాసి రెడ్డి ని ఐక్య వేధిక అగ్రనేతలు ప్రశంశల వర్షం కురిపించారు. మహిళ అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కాజా రెడ్డి యం.యల్.ఎ., యం.పి మాజీలను ఆహ్వానిస్తూ మరోవైపు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఐక్య సదస్సుకు హాజరు కావడంలో కీలక భూమిక పోశించడమే కాకుండా రెడ్లను అత్యదిక సంఖ్యలో ఆహ్వానించడంలో కీలక భూమిక పోశించారని భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తోపాటు పట్ణం సురెంద్ర రెడ్డి తదితరులు అభినందనల వర్షం కురిపించారు. కొంతమంది నకిలీలు ఆమే నాయకత్వానికి కూడాజీర్నించుకోలేకపోయారు అని అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాము అండగా నిలుస్తామని మీరు ముందుకు సాగాలని సుహాసినిని ప్రోత్సహించారు. ఈ సందర్బంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ఇంతమంది తనకు ప్రోత్సాహం ఇస్తున్నారని తాను ఎలాంటి కుట్రలను ఎదుర్కోంటానని బయపడే ప్రశక్తే లేదని అన్నారు. భవశ్యత్తులో రెడ్ల ఐక్య వేదిక ఆద్వర్యంలో జరిగే ప్రతి సభను ఉమ్మడి కర్నూలు జిల్లా తరుపున విజయవంతం చేసే భాద్యతను తీసుకుంటాను అని రెడ్ల సంఘం ప్రతినిదుల హర్శద్వనాల మద్య ప్రకటించారు. నంద్యల పట్టణంలోనే ప్రముఖ తెలుగు దేశం నాయకుడు నరహరి విశ్వనాథ్ రెడ్డి, విద్యా సంస్థల అదినేతలు డా.. రామకృష్ణా రెడ్డి, ఎ.వి.ఆర్.యస్.వి.ఆర్ వెంకట రామిరెడ్డి తదితరులు సహకారం అందించారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *