జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
ప్రపంచంలోనే రెండవ దేవాలయంగా వెలసిన నంద్యాల జిల్లా కేంద్రంలోని జగజ్జనని దేవాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఆషాడ మాస వేడుకల్లో మహిళా భక్తులతో పోటెత్తుతున్నది. గత 30 సంవత్సరాల నుండి ఆషాడ మాస వేడుకలను జగజ్జనని ఆలయంలో ఆలయ నిర్వాహకులు పుల్లయ్య, నారాయణ ల ఆధ్వర్యంలో పుట్టింటి పట్టుచీర వేడుకను నిర్వహిస్తున్నారు.జులై 6 నుండి ఆగస్టు 7 వరకు ప్రతిరోజు పదివేల మందికి తక్కువ కాకుండా ఏపీ,తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు ల నుండి పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాల్లో మహిళా భక్తులు చేరుకొని ఆలయానికి రెండు మూడు కిలోమీటర్ల ముందు నుంచే జై జగజ్జనని మాత….జై జై జగజ్జనని మాత… అంటూ నినాదాలు చేసుకుంటూ ఆలయముకు చేరుకుంటున్నారు.ర్యాలీకి ముందుగా మేల తాళాల వాయిద్యాలతో భక్తి పాటలు వినిపిస్తూ డాన్సులు చేస్తున్నారు.దర్శనానికి వచ్చిన ప్రతి భక్తురాలు హిందూ సంప్రదాయ దుస్తులతో చేరుకున్న వారికే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులకు అమ్మవారి కంకణం కుంకుమలతో పాటు టిఫిన్లు,భోజన వసతులు కల్పిస్తున్నారు.ఆషాడమాసం ముగిసేసరికి 2.50 లక్షల నుండి 3 లక్షల మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొనవచ్చునని అంచనా వేస్తున్నారు.