!! రామకృష్ణ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు ఈనెల 10వ తేదీ ఆఖరి తేదీ!

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

రాయలసీమలోనే మహోన్నత విద్యాసంస్థలుగా పేరు ప్రఖ్యాతులు సాధించిన, నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో చేరడానికి విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. గత రెండు రోజుల నుండి కళాశాలలో ఏర్పాటుచేసిన రెండు రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రాలకు సుదూర ప్రాంతాల నుండి వచ్చి పేర్లను నమోదు చేసుకుంటున్నారు.ఆరు కోర్సులు ఉన్న రామకృష్ణ విద్యాసంస్థల్లో, సొంతంగా ఆన్లైన్ చేసుకునే వారు కొందరైతే, కొందరు కళాశాలకు వచ్చి హెల్ప్ లైన్ కేంద్రాలను చేరుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు.
కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ఒకరి కోసం నిబంధనలను మార్చమని అందువల్ల అందరికీ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తామని అందువల్ల పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు.

కళాశాలలో ఉన్న కోర్సులు : B.Sc లో Mtahs కూడిన కంప్యూటర్స్, B.Sc botany,B.Com Computers, B.Com.General, B.C.A, B.B.A కోర్సులు ఉన్నాయన్నారు

ఫీజుల వివరాలు: ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత విద్యా మండలి నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేస్తామని ఒకవేళ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే మొత్తాలను కూడా వారికి తిరిగి చెల్లిస్తామని, మొత్తం పారదర్శకంగానే ఉంటుందని రామకృష్ణారెడ్డి తెలిపారు
BBA కు,BCA కు ఏడాదికి 18వేలు చొప్పున, బీఎస్సీ కంప్యూటర్స్ లో చేరే వారికి 15వేలు, బీకాం జనరల్ లో చేరేవారికి 12వేలు, చెల్లించాల్సి ఉంటుందని ఇది ఇప్పటివరకు ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయం అన్నారు ఒకవేళ మార్పులు ఉంటే అదే పద్ధతిని ఫాలో అవుతామన్నారు

ఈనెల 10వ తేదీ చివరి రోజు : డిగ్రీ కళాశాలలో సీటు కోసం దరఖాస్తు చేసుకునేవారు జులై 10వ తేదీ 2024 చివరి తేదీ అని రామకృష్ణారెడ్డి తెలిపారు ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చని 19వ తేదీన సీటు అలాట్మెంట్ జరుగుతుందన్నారు
ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు జనరల్ అయితే 400/-బీసీ అయితే 300/-ఎస్సీ ఎస్టీ అయితే 200/- మాత్రమే చెల్లించాలని ఆయన తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *