ఉయ్యాలవాడలో..సెప్టెంబర్ 1న రెడ్ల ఐక్య వేధిక ఆత్మీయ సమావేశం. *

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

   సెప్టెంబర్ 1న రెడ్ల ఐక్య వేధిక ఆత్మీయ సమావేశం.
* ఉయ్యాలవాడ మండల కేంద్రములో..
* రాజకీయాలకు అతీతంగా ఐక్య వేధిక సమావేశం...

నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడ మండల కేంద్రములో సెప్టెంబర్ 1వ తారీకున జరిగే అఖిల భారత రెడ్ల ఐక్య వేదిక ఆత్మియ సమావేశానికి స్పందన అనూహ్యంగా ఉందని ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వినర్  శ్రీమతి. సుహాసిని రెడ్డి తెలిపారు. శుక్రవారము నంద్యాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐక్య వేదిక నాయకులు సురేంద్ర రెడ్డి , గోపాల్ రెడ్డ్ , దామోధర్ రెడ్డి  మరియు జితేంద్ర రెడ్డి గార్ల ఆద్వర్యంలో జరిగే సమావేశానికి నంద్యాల యం.పి భైరెడ్డి శభరి తండ్రి భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉయ్యాలవాడ మండల కేంద్రములోని గోల్డెన్ ఫక్షన్ హాల్ లో 1వ తేదీ జరిగే సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రెడ్డి ప్రజా ప్రతినిధులను మాజీ లను కూడా స్వయంగా కలిసి ఆహ్వనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు భైరెడ్డి శభరి ఆళ్లగడ్డ యం.ఎల్.ఎ భూమా అఖిల ప్రియ తో పాటు మాజీ యం.ఎల్.ఎ శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి నంద్యాల పట్టణంలోని ప్రముకులు న్యాయవాది. తాతిరెడ్డి తులసి రెడ్డి, రామ క్రిష్ణా విద్యాసంస్తల అధినేత రామక్రిష్ణా రెడ్డి, టి.డి.పి నాయకులు మాండ్ర శివానంద రెడ్డి తదితరులను కలిసి  ఆ హ్వానించామన్నారు. మిగతా వారిని కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసే భాద్యత ప్రతి రెడ్డి సొదరి, సొదరులపై ఉందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో కీలకమైన సూచనలను లిఖిత పూర్వకముగా గానీ, మౌఖికంగా గానీ చెప్పవచ్చు అన్నారు. సమావేశం వివరాలను 9502447878 పొన్ నెంబర్ ను సంప్రదించాలని కొరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *