!!దేశంలో బిసిలదే పైచేయి !!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంటు అసెంబ్లీ స్థానాలలో బిసిలకు అగ్రపీఠం వేసింది..గత రెండు రోజుల క్రితం అసెంబ్లీకి .పార్లమెంటుకు పోటీచేస్తున్న అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించారు..మిత్రపక్షాలైన బిజెపి,జనసేనలకు 31, టిడిపి 144 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నారు..ఇందులో టిడిపి ప్రకటించిన అభ్యర్ధులలో 34 మంది బిసిలు, 32 మంది కమ్మలు, 27మందిరెడ్డు, 25 మంది ఎస్ సిలు, 10 మంది కాపులు,5 మంది క్షత్రియులు 4 గురు ఎస్టిలు,3 మైనార్టీలు, ఇరువురు వైశ్యులు వెలమ బలజలు ఒక్కొక్క చోట పోటీచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంటుకు కేటాయించిన 17 స్థానాలలో 6గురు బిసిలు, మూడు ఎస్ సిలు నలుగురు రెడ్డు, నలుగురు కమ్మలకు కేటాయించారు..మిగిలిన 8 ఎంపి సీట్లను జనసేన,బిజెపిలకు కేటాయించారు..వారు కూడా కులాలు,మతాలను ఆదారంచేసుకుని కేటాయించారు..ఇలా కేటాయింపు జరగడంతో పాత వారికి అన్యాయం జరుగుతున్నదని కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు..వీరిని చల్ల బరచడానికి పార్టీ అధినేతలు చంద్రబాబునాయుడు, లోకేష్ బాబుల ఆద్వర్యంలో టీంలు రంగంలోకి దిగి తగు హామీలు ఇస్తూ చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *