♦కాటసానితో జనాస్త్రం ప్రతినిది జనార్ధనరెడ్డి ఇంటర్వూ
♠ స్ట్రయిట్ … ఫైట్ …. స్ట్రయిట్ … ఓటు
♠ భారీ అసెంబ్లీ, ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటాం
♠ జగన్ అస్త్రాలు అద్భుతం, అమోఘం
♠ టిడిపి మైలేజి పెరగలేదు
♠ దమ్ముంటే బాబు చేసిన వాటిపై ఓటు అడగాలి
2019 కంటే 2024 ఎన్నికల్లో జగన్ వ్యూహాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని వాటితో తెలుగుదేశం పార్టీ 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు పైసల్ అయ్యి పోతారని నంద్యాల జిల్లా వైయప్ఆర్సిపి అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి జనాస్త్రంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వైసిపి అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఓటర్లకు నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఎలాంటి రేకమెండేషన్ కానీ, మాములు గానీ ఇవ్వకుండానే సంక్షేమ పథకాలు అమలు జరిగాయని ఇవ్వే వైసిపికి శ్రీరామ రక్షగా భావిస్తున్నామని భూపాల్ రెడ్డి అన్నారు.
♦కాటసానితో జనాస్త్రం ప్రతినిది జనార్ధనరెడ్డి ఇంటర్వూ
జనాస్త్రం : ఈసారి మీ పార్టీ అధికారంలోకి రావడం కాదా ?
కాటసాని : ఇది పాత్రికేయుడి ప్రశ్ననా … ప్రతిపక్షల ఆరోపణనా
జనాస్త్రం : రెండిటితోపాటు ఓటర్లు కుడా అడుగుతున్న ప్రశ్న ?
కాటసాని : ఎవరి ప్రశ్నైనా సరే వైసిపి 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడానికి జగన్ దగ్గర అన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ అమలు అవుతాయి. అందరూ గెలుస్తారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అధికార పార్టీకి రానన్ని సీట్లు వైసిపికి వస్తాయి. నూరు శాతం గ్యారెంటీ.
జనాస్త్రం : ఏ అంశాలతో విజయం సాధిస్తారు.
కాటసాని : కులం, మతం ప్రస్తవణ లేకుండా అందరికి ముఖ్యంగా మా ఆగర్భ శత్రువులైనా వారికి కుడా పథకాలను అమలు చేశాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మైలేజీ ఏ మాత్రం పెరగలేదు. మా మీద బురద చల్లి లేనిది క్రియేట్ చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఇది సాధ్యమైయ్యే పని కాదు.
జనాస్త్రం : మా పాలన మెచ్చి ఓట్లు వేయమని అడగడం జగన్ మైండ్ గేమా
కాటసాని : జగన్ ఏం చెప్పినా టిడిపికి, జనసేనకు మైండ్ గేమ్గా ఉంటుంది. చంద్రబాబు 15 ఏళ్ల సీఎం కాదా. ఆయన హాయంలో జరిగిన పథకాలను చెప్పి జగన్కు ఇదే సవాల్ చేయవచ్చు కాదా. మేము ఐదు ఏళ్లకే మా పాలన చూసి ఓటు అడుగుతున్నాం. ప్రత్యర్థులు ఎందుకు అడలేక పోతున్నారు. వారి దృష్టిలో వారు చేస్తే సంసారం … ఇతరులు చేస్తే వ్యభిచారం అంటున్నారు.
జనాస్త్రం : చివరిగా ఏ వర్గాలు మీకు అండగా నిలుస్తాయని అనుకుంటున్నారు.
కాటసాని : చంద్రబాబుకు అన్ని వర్గాలు 2019లోనే దూరమైయ్యి ఆ వర్గాలన్ని మాతోటే ఉన్నాయి. ఓటు హక్కు కలిగిన పత్రి యువతి, మహిళ కుల, మత ప్రసక్తి లేకుండా 80 శాతం ఓట్లు మాకే వేస్తారు. ఇదే స్థాయిలో పురుష ఓటర్లు కుడా ఉన్నారు. మేము ఎంతో విశ్వసనియత ఉన్న సంస్థలతో మా పార్టీ అధినేత చేయిస్తున్నారు. వారందరూ వైసిపి అభ్యర్థులకు, ఎంపీ, ఎమ్మెల్యే భారీగా వస్తాయి. నేను కుడా లోతుగా అధ్యాయం చేసి చెబుతున్నా మా పార్టీ జరిపే సిద్ధం సభలకు వచ్చే జనాల అభిప్రాయాలు కుడా వైసిపికే అనూకులంగా ఉన్నాయి.